తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రోటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డితో పాటు తమిళనాడు మంత్రి అంబిల్ మహేష్, ఎంపీలు గురుమూర్తి, మాగుంట శ్రీనివాసులురెడ్డి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.