హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన క్లినిషియన్ సైంటిస్ట్ జావేద్అలీ అరుదైన ‘జేసీ బోస్’ ఫెలోషిప్ను సొంతం చేసుకొన్నారు. నేత్ర వైద్యంలోని డాక్రియాలజీలో డాక్టర్ జావేద్ అలీ ఎనలేని సేవలు అందించారు.
ఇందుకుగాను కేంద్రప్రభుత్వ సంస్థ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రిసెర్చ్ బోర్డ్ (ఎస్ఈఆర్బీ) ఆయనకు ‘జగదీశ్ చంద్రబోస్’ పేరిట ఫెలోషిప్ను అందజేసింది. ఇక జావేద్ తన పరిశోధనలకు ప్రతి నెల రూ.25వేల చొప్పున ఐదేండ్లపాటు రూ.15లక్షల రిసెర్చ్ గ్రాంట్ను అందుకోనున్నారు.