హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 30 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలోని నాబి (నేషనల్ అకాడమీ ఆఫ్ బర్న్ ఇంజురీస్), ఆప్సీ (అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆఫ్ ఇండియా)లకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం నుంచి ప్రొఫెసర్ పలుకూరి లక్ష్మీ ఎంపికయ్యారు.
రెండు జాతీయ స్థాయి అసోసియేషన్లకు ఒకే సంవత్సరంలో ఎన్నిక కావడం ఉస్మానియా చరిత్రలో ఇదే తొలిసారి. డాక్టర్ లక్ష్మి సేవలను గుర్తించిన నాబి, ఆప్సిలు ఆమెను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నుకున్నాయి.