హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఈ నెల 21 నుంచి ఆన్లైన్లో పీజీఈసెట్ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ రూ.250 ఆలస్య రుసుముతో బుధవారం ముగిసింది. మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు.