మంచిర్యాల : జిల్లాలోని లక్సెట్టిపేట మండలం పాత కొమ్ముగూడెంలో ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి చెందారు. పట్టించుకునేవారు లేక వారు చనిపోయినట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉండగా, ఇటీవలే ఓ కుమారుడు చనిపోయాడు. మిగతా ఇద్దరు కుమారులు గ్రామం వదిలి వెళ్లారు.
దీంతో ఆ వృద్ధ దంపతుల బాగోగులు చూసేవారే లేకుండా పోయారు. అనారోగ్యంతో మంచాన పడి, ఆకలితో అలమటించి ఆ దంపతులు చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులను బియ్యాల రాజయ్య, మల్లమ్మగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిని మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ పరిశీలించారు.