హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ): ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రధాన కోర్సులుగా ప్రసిద్ధిచెందిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలకు డిమాండ్ తగ్గుతున్నది. వివిధ కాలేజీలు ఆయా కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించి, కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది కోర్ కోర్సులకు సంబంధించి 2.,010 సీట్లు రద్దయ్యాయి. వీటి స్థానంలో డిమాండ్, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్, డాటాసైన్స్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి 28 కాలేజీల్లో కోర్ కోర్సుల రద్దు, కొత్త కోర్సులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇటీవల రెండు జీవో(జీవో 149, జీవో 150)లను జారీచేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)తో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీగా పేరొందిన పలు కొత్త కోర్సుల నిర్వహణపై కాలేజీలు ఆసక్తిచూపిస్తున్నాయి.
ప్రధాన కోర్సుల్లో సీట్లను తగ్గించిన కొన్ని కాలేజీలు