హైదరాబాద్: హైదరాబాద్లోని రాయదుర్గంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పనిచేస్తున్న ఇంట్లోనే చోరీకి పాల్పడిన నేపాల్ దంపతులను అరెస్టు చేశారు. ఈనెల 19న రాయదుర్గంలోని టెలికాంనగర్లో ఉన్న ఓ ఇంట్లో రూ.10 లక్షలు, 110 తులాల బంగారం నేపాల్కు చెందిన దంపతులు ఎత్తుకెళ్లారు. వారిద్దరు ఐదు నెలల క్రితమే ఇంట్లో పనికి కుదిరారని పోలీసులు తెలిపారు.
ఇంటి యజమాని శ్రీశైలానికి వెళ్లడంతో అదునుచూసి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని నగలు, నగదుతో పరారయ్యారు. దీంతో ఆరు రోజుల వ్యవధిలోనే పోలీసులు దొంగలను పట్టుకున్నారు. కాగా, హైదరాబాద్లో నేపాలీ ముఠాలు తరచూ దోపిడీలకు పాల్పడుతున్నారు.