హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సమర్థంగా అమలవుతున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ (సీసీటీఎన్స్)పై 76 ఆర్ఆర్ ట్రైనీ ఐపీఎస్లకు ఎన్సీఆర్బీ జాయింట్ డైరెక్టర్ సంజయ్మథూర్ శిక్షణ ఇచ్చారు. ఆదివారం సర్దార్ వల్లభయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్లకు దేశవ్యాప్తంగా 16 వేలకుపైగా పోలీస్స్టేషన్లలో అమలవుతున్న ఈ డిజిటల్ విధానంపై అవగాహన కల్పించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్గా రికార్డులు భద్రపరచడం, ఆయా స్టేషన్ల నుంచి సమాచారం తీసుకోవడం, నేరస్థుల ట్రాక్రికార్డు మానిటరింగ్ చేయడం, ఆయా స్టేషన్ల పనితీరును అంచనా వేయడం, ఏ స్టేషన్ పరిధిలో ఎక్కువగా నేరాలు నమోదవుతున్నాయి? అవి ఏ తరహా నేరాలు? వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అనే విషయాలు తెలుసుకొనే విధానంపై వివరించారు. ఈ-గవర్నెన్స్ ద్వారా సమర్థ పోలీసింగ్ కోసం ఈ విధానాన్ని 2013 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.