బంజారాహిల్స్/ హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): మహిళలను డ్రైవింగ్ వైపు ప్రోత్సహించేందుకు సాహసం చేసిందో మహిళ.. డ్రైవింగ్తోనూ ఉపాధి దొరుకుతున్నదని చాటి చెప్పేందుకు బైక్పై దేశం చుట్టివచ్చింది. హైదరాబాద్కు చెంది న మూవింగ్ ఉమెన్ సోషల్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ (ఎంవోడబ్ల్యూవో) వ్యవస్థాపకురాలు 46 రోజుల పాటు 22 నగరాలు చుట్టివచ్చారు. మూవిం గ్ బౌండరీస్ పేరుతో బెంగళూరు, చెన్నై, కొచ్చి, గోవా, పుణె, ముంబై, వారణాసి, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాల మీదుగా 11,111 కిలోమీటర్ల యాత్రను కొనసాగించిన ఆమె.. శుక్రవారం టూర్ను దిగ్విజయంగా ముగించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జయభారతి మాట్లాడుతూ.. మహిళలు డ్రైవిం గ్ నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చని చె ప్పారు. దేశవ్యాప్తంగా మహిళాడ్రైవర్లు 10 శాతం కంటే తక్కువగా ఉన్నారని, ఈ సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని అన్నారు. మహిళలకు డ్రైవింగ్ నేర్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నదని, దేశానికే ఇది ఆదర్శమని వెల్లడించారు. డ్రైవింగ్ నేర్చుకొని ఉపాధి కోసం చూసే మహిళల కోసం వాట్సాప్లో చాట్బోట్ తీసుకువచ్చామని, ఆసక్తిఉన్నవారు +9188859 16606 నంబర్కు హాయ్ అని సం దేశం పంపిస్తే శిక్షణ, ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. పవర్ కార్యక్రమం ద్వారా టూర్ను స్పాన్సర్ చేసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిలో సాధికారత తీసుకువచ్చేందుకు యూ కే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు. మూవింగ్ బౌండరీస్లో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉన్నదని అన్నారు. స మాజంలో పురుషులతో సమానంగా మహిళలకు స్వేచ్ఛ కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో టూర్ భాగస్వామి సంస్థ షెల్ ఫౌండేషన్ ప్రతినిధి షిప్రా నాయర్, స్పాన్సర్లు పాల్గొన్నారు.