ఊట్కూర్, ఆగస్టు 28 : ద్విచక్ర వాహనంపై పరిమితికిమించి ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఓ పోలీస్ అడ్డుకొని అవగాహన కల్పించిన ఘటన శుక్రవారం నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఒకే ద్విచక్ర వాహనంపై ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలతో ఒక వ్యక్తి బైక్పై ప్రమాదకరంగా వెళ్తుండగా..
ఊట్కూరు సమీపంలోని చెక్పోస్టు వద్ద గమనించిన హెడ్కానిస్టేబుల్ రంజిత్కుమార్ వారిని నిలువరించారు. ‘దండం పెట్టి మరీ వేడుకుంటున్నా.. హెల్మెట్ ధరించండి, ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణించవద్దు, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించండి’ అని ఆయన వారికి సూచించారు.