హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి (Thigulla Krishna Murthy) సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉడుకు నెత్తురు ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగిన గేయం సాయిచంద్, చక్కటి ప్రగతి పాలపిట్ట ఆట సాయిచంద్ అని చెప్పారు. నీ స్వరం నీత్యం మా మనసులో నిలిచి ఉంటుందన్నారు.
‘ఉడుకు నెత్తురు ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగిన గేయం సాయిచంద్. నిప్పుల ప్రవాహం నింగినంటేలా నిలిచి ఎగసిన గానం సాయిచంద్. పిక్కటిల్లే తెలంగాణ పాట ప్రతిరూపం సాయి చంద్. చక్కటి ప్రగతి పాలపిట్ట ఆట సాయిచంద్. నీ స్వరం నిత్యం మా మనసులో నిలిచి ఉంటుంది. నిష్కల్మషమైన నీ నవ్వు నిరంతరం మమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. ఉద్యమ వీరుడా జోహారు’ అని నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి ట్వీట్ చేశారు.
ఉడుకు నెత్తురు ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగిన గేయం సాయిచంద్. నిప్పుల ప్రవాహం నింగినంటేలా నిలిచి ఎగసిన గానం సాయిచంద్. పిక్కటిల్లే తెలంగాణ పాట ప్రతిరూపం సాయి చంద్. చక్కటి ప్రగతి పాలపిట్ట ఆట సాయిచంద్. నిష్కల్మషమైన నీ నవ్వు నిరంతరం మమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. ఉద్యమ వీరుడా జోహారు. pic.twitter.com/CT54RNoCxP
— Krishna Murthy Thigulla (@TKrishna_Murthy) June 29, 2023