హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా బారినపడి ‘నమస్తే తెలంగాణ’ మెదక్ జిల్లా డెస్క్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్న ఎం అజయ్కుమార్ (44) కన్నుమూశారు. హైదరాబాద్ అమీర్పేట ధరంకరం రోడ్డులోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం సాయంత్రం మృతిచెందారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన అజయ్ హైదరాబాద్ బోరబండలో నివాసం ఉంటున్నారు. గత నెల చివరివారంలో కరోనా బారినపడ్డారు. శ్వాస సమస్య తీవ్రం కావడంతో అమీర్పేట ధరంకరం రోడ్డులోని ప్రైవేటు దవాఖానలో చేరారు. ఐదు రోజులు చికిత్స ఆనంతరం డిశ్చార్జి అయిన ఆయన, తిరిగి రెండు రోజుల వ్యవధిలోనే న్యూమోనియాతో బాధపడ్డారు. దీంతో అజయ్ ఈ నెల 6న మళ్లీ ఆదే దవాఖానలో చేరారు. 9 రోజులపాటు మహమ్మారితో పోరాడినా ఫలితం దక్కలేదు. అజయ్కు భార్య శ్రీదేవి, తొమ్మిదేండ్ల కుమారుడు, ఏడేండ్ల కుమార్తె ఉన్నారు. అజయ్ 20 ఏండ్లుగా మీడియాలో కొనసాగుతున్నారు. ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, సూర్య, నమస్తే తెలంగాణ పత్రికల్లో సబ్ ఎడిటర్గా విధులు నిర్వర్తించారు.