కులకచర్ల, జూన్ 13 : తనకు బతకాలని లేదని.. తాను లేకపోతే పిల్లలు అనాథలవుతారని ఓ తల్లి.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్లో చోటుచేసుకున్నది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అడవివెంకటాపూర్కు చెందిన నవనీత (28) శనివారం తన ఇద్దరు పిల్ల లు విగ్నేశ్(7), మధుప్రియ(5)కు ఉరివేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ‘నా చా వుకు ఎవరూ కారణం కాదు. నాకు బతకాలని లేదు. అలాగని నేను లేకుండా పిల్లలు బతకడం కష్టం. అందుకే వారిని నా వెంటే తీసుకుపోతున్నా. మా చావుకు నా భర్త కా రణం కాదు. ఆయనను ఏమీ అనొద్దు. నన్ను క్షమించగలరు’ అనే సూసైడ్ నోట్ ఆ ఇంట్లో లభించినట్టు పోలీసులు తెలిపారు.