హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం( Kothagudem airport ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు. ఈ మేరకు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని (Rammohan Naidu) కలిసి వినతిపత్రం అందజేశారు. కాగా, కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
నాటి ప్రభుత్వం టెక్నో ఎకనామిక్ ఫీజ్బిలిటీ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. గతంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించతలపెట్టిన విమానాశ్రయభూములకు సంబంధించి సైట్ క్లియరెన్స్ ఇవ్వాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు నివేదికలో ప్రభుత్వాన్ని కోరారు. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సైతం సానుకూల నివేదిక ఇవ్వడంతో జిల్లా ప్రజల చిరకాల కోరికగా ఉన్న విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియకు నాడే బీజం పడింది.