Minister Niranjan Reddy | పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని టీఆర్ఎస్ మరోసారి రుజువు చేసింది. వనపర్తి మండలంలో ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి టీఆర్ఎస్ పార్టీ భీమా వర్తింపచేస్తోంది. ఈ క్రమంలోనే వనపర్తి నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన ఆరుగురు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందజేయడం జరిగింది.
గోపాల్ పేట మండలం చెన్నూర్కు చెందిన భూత్పూర్ మద్దిలేటి సతీమణి లక్ష్మికి, వనపర్తి మండలం కండ్రియా తండాకు చెందిన బోయ బాబు సతీమణి రేణుకకు, గోపాల్ పేట మండలం నాగపూర్కు చెందిన తలారి మల్లయ్య సతీమణి నరసమ్మకు, గోపాల్ పేట మండలం ఏదులకు చెందిన తోలె కాశీం తండ్రి బాలస్వామికి,
పెద్దమందడి మండలం మంగంపల్లి తండాకు చెందిన మెగావత్ తేజా నాయక్ సతీమణి శాంతమ్మకు, పెబ్బేరుకు చెందిన కావలి పురుషోత్తం సతీమణి లక్ష్మికి ఈ చెక్కులు అందజేశారు. వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి.. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పార్టీ భీమా చెక్కులను అందజేశారు.