హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక సంస్థకు పునాదిరాయి పడనుంది. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ (Foxconn) టెక్నాలజీస్కు రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో (Kongara Kalaan) మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫాక్స్కాన్ తొలి ప్లాంట్కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రూ.4 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్తో తొలిదశలో 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు (Jobs) లభిస్తాయని చెప్పారు. ఇది తెలంగాణ ప్రదర్శిస్తున్న వేగానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్కాన్. సుమారు 70 శాతం యాపిల్ ఐఫోన్లను ఫాక్స్కాన్ కంపెనీయే తయారు చేస్తున్నది. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, సుమారు రూ.1,656 (200 మిలియన్ డాలర్లు) కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్కాన్ ఇక్కడ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇందులో దాదాపు 35 వేల మందికి ప్రత్యక్ష్యంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
యాపిల్ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్కాన్కు భారీ ఆర్డర్ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకొన్నది. యాపిల్ కంపెనీ ఎయిర్పాడ్లు, వైర్లెస్ ఇయర్ఫోన్ల తయారీ ఆర్డర్ను ఫాక్స్కాన్కు అప్పగించింది. ఇప్పటివరకూ మొబైల్ ఫోన్ల తయారీకే ప్రాధాన్యమిచ్చిన ఫాక్స్కాన్.. ఇప్పుడు ఎయిర్పాడ్ల తయారీలోకి అడుగు పెడుతున్నది. ఇటీవలే ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్లూ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధిబృందం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటుపై చర్చించిన విషయం తెలిసిందే.
Demonstrating the “Telangana Speed”, I am happy to announce the groundbreaking of first of Foxconn’s plants in Telangana at Kongar Kalaan today
With an investment of over $500M it shall create 25,000 direct jobs in first Phase #Telangana #Foxconn pic.twitter.com/PHThJWxsfT
— KTR (@KTRBRS) May 15, 2023