హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో మళ్లీ డబుల్ డెకర్ బస్సులు పరుగు తీయనున్నాయి. నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న మూడు ఎలక్ట్రిక్ బస్సులను పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 11న హైదరాబాద్లో ప్రారంభం కానున్న ఫార్ములా ఈ-ప్రిక్స్ నేపథ్యంలో ఈ బస్సులు ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు, ప్యారడైజ్, నిజాం కాలేజీ స్ట్రెచ్లను కవర్చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరుగుతాయి. అనంతరం పర్యాటక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ బస్సులను హెరిటేజ్ సర్యూట్లో ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
హైదరాబాద్లో డబుల్ డెకర్ బస్సులకు చారిత్రక ప్రాధాన్యం ఉన్నది. నిజాం హయాంలో మొదలైన సంప్రదాయ డబుల్ డెకర్ బస్సులు 2003 వరకు నగరంలో తిరిగాయి. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెకర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చారు. అందులో మూడు బస్సులు మంగళవారం డెలివరీ కాగా, వాటిని ప్రారంభించారు. మిగిలిన మూడు బస్సులు కూడా త్వరలో రానున్నాయి. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, చాం ద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఎం ఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ డబుల్ డెకర్ విశేషాలు