యాదాద్రి, జనవరి 21: సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో రూపుదిద్దుకొన్న నారసింహుడి స్వయంభువుల దర్శనం మార్చి 28న పునఃప్రారంభం కానున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మార్చి 21 నుంచి 28 వరకు 1,008 కుండలతో కూడిన మహా సుదర్శన యాగం, మహాకుంభ సంప్రోక్షణ క్రతువులను రోజూ లక్ష మంది వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని విప్ గొంగిడి సునీతతో కలిసి మంత్రి దర్శించుకొన్నా రు. నూతనాలయం, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, కొండ కింద గల గండిచెరువు, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిని పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 15 వరకు ఆలయ తుది మెరుగులు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు స్వర్ణతాపడం పనులు పూర్తి చేయనున్నట్టు స్పష్టంచేశారు.