పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న థియేటర్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. రెండు వారాలు సక్సెస్ఫుల్గా నడిచిన ఈ చిత్రంకు కరోనా వలన ఆదరణ కరువైంది. దీంతో మూవీని ఏప్రిల్ 30 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ వీక్షించింది. సినిమా చూశాక తెగ ఫీలైపోతూ ట్వీట్ చేసింది. ముందుగా ఇందులో నివేదా ఆఫర్ అనుపమ దగ్గరకు వెళ్లగా, డేట్స్ కుదరక సినిమాను వదులుకుంది.
అనుపమ తన ట్వీట్లో .. సో సారీ.. ఇప్పుడే నేను రియలైజ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మీపై గౌరవం, ప్రేమ పెరిగింది. ముగ్గురు లేడీస్తో పవన్ కళ్యాణ్ సినిమాను అద్భుతంగా నడిపించారు. ప్రకాశ్ రాజ్ లేకుండా ఈ సినిమా లేదు అంటూ ప్రశంసలు కురిపించింది అనుపమ. అయితే కోవిడ్ కాలంలో భారీ కలెక్షన్స్ పొందిన ఏకైక ఇండియన్ మూవీగా ‘వకీల్ సాబ్’ నిలిచి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేసింది.