జగిత్యాల : ధర్మపురి(Dharmapuri) లక్ష్మీ నరసింహ స్వామి( Lakshmi Narasimha Swami) వారిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) సతీసమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, నర్సింగ్ కాలేజీ మంజూరు, ఎంసీహెచ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బంది నియామకం, ప్రస్తుత సీహెచ్సీలో శవ పంచనామ వంటి పలు సమస్యలను తన దృష్టికి వచ్చాయన్నారు. వాటన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అంతకుముందు అర్చకులు, ఆలయ సిబ్బంది మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.