హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంఐఎం పార్టీ కోరింది. ఈ మేరకు స్పీకర్ శ్రీనివాస్ రెడ్డికి ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ లేఖ రాశారు.
పదేపదే తన చర్యలతో రాజాసింగ్ శాసనసభ్యునిగా అర్హతలు కోల్పోతున్నారని, సభ వెలుపల, లోపల ఆయన వైఖరి కారణంగా అసెంబ్లీ గౌరవానికి భంగం కలుగుతుందని పేర్కొన్నారు. రాజాసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నాయని, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాజాసింగ్పై బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించాలని స్పీకర్కు ఎమ్మెల్యే ఖాద్రీ విజ్ఞప్తి చేశారు.