MERU International School | హైదరాబాద్లోనే మెరు ఇంటర్నేషనల్ స్కూల్ నంబర్ వన్ స్కూల్గా నిలిచింది. అంతే కాదు ఎడ్యుకేషన్ వరల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో మెరు ఇంటర్నేషనల్ స్కూల్కు ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ వరల్డ్ (ఈడబ్ల్యూ)-గ్రాండ్ జ్యూరీ ర్యాంకింగ్స్లో `బెస్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అవార్డ్` లభించింది. హైదరాబాద్తోపాటు తెలంగాణలోనే ఈ స్కూల్ నంబర్ వన్ స్కూల్గా నిలిచింది. దేశవ్యాప్తంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. సీ-ఫోర్ అనే సంస్థతో కలిసి ఎడ్యుకేషన్ వరల్డ్ నిర్వహించిన సర్వేలో మెరు ఇంటర్నేషనల్ స్కూల్కు ఈ అవార్డు లభించింది. సమ్మిళిత అభ్యాస పద్దతులు, సంప్రదాయ- డిజిటల్ బోధనా పద్దతులతో విద్యార్థుల కేంద్రీకృత బోధనలను అందుబాటులోకి తెచ్చింది మెరు ఇంటర్నేషనల్ స్కూల్.
అనుకూల & సహాయ బోధనా విధానం (adaptive & supportive teaching-learning)లో మెరు ఇంటర్నేషనల్ స్కూల్ బోధనా సిబ్బంది.. తమ విద్యార్థులు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత అభ్యాస మార్గంలో పయనించేలా విద్యాబోధన చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో తరగతి గదుల్లో ముఖాముఖీ చర్చల్లో, ల్యాబ్ కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తూ రోటేషన్ బోధనా పద్దతులను అమలు చేస్తున్నది మెరు ఇంటర్నేషనల్ స్కూల్. ఆన్లైన్, ఆఫ్లైన్ బృంద కార్యకలాపాల ద్వారా విద్యార్థుల మధ్య ముఖాముఖీ చర్చలు జరిపేలా ప్రోత్సహిస్తున్నది. తద్వారా జీవితకాలమంతా అభ్యాసకులుగా విద్యార్థులకు సాధికారత కల్పన దిశగా మెరు అడుగులేస్తున్నది.
జూన్-సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు ఈ సర్వే జరిగింది. దేశంలోని 28 నగరాల పరిధిలోని విద్యావేత్తలు, స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లు, సెకా (సోషియో-ఎకనమిక్ క్యాటగిరీ ఏ) పేరెంట్స్, సీనియర్ స్కూల్ విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిని 118 మంది సీ-ఫోర్ ఫీల్డ్ రీసెర్చర్లు ఇంటర్వ్యూ చేశారు.
`మా స్కూల్కు ఎడ్యుకేషన్ వరల్డ్ నుంచి ఒక అవార్డు రావడం వరుసగా రెండోసారి. ఇందుకు మేం గర్వ పడుతున్నాం. అభ్యాసన కేంద్రంగా విద్యనందించాలన్న మా నిబద్ధతకు నిది నిదర్శనం. మా స్కూల్ పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలతో మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రేరణ కల్పించడానికి ఈ అవార్డు ఉపకరిస్తుంది. నిరంతరం మాకు మద్దతుగా ఉన్న యావత్ మెరు ఫ్యామిలీకి ధన్యవాదాలు` అని మెరు ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ మేఘనారావు జూపల్లి తెలిపారు.