కరోనా వేళ అన్ని చిత్రవిచిత్రాలే చోటుచేసుకుంటున్నాయి. పురోహితుడు కారులో నుంచి మం త్రాలు చదివితే వేదికపై పెండ్లి తంతు కొనసాగింది. ఈ విచిత్ర ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ లో ఆదివారం చోటుచేసుకున్నది. కోహెడకు చెందిన సటికం భాగ్య- మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో కోహెడలో ఆదివారం జరిగింది. పురోహితుడు ప్రసాద్రావు శర్మ.. మండపానికి వచ్చి కారులో నుంచే మంత్రాలు పఠించారు. మైక్ ద్వారా కారులో నుంచి వేదికపై ఉన్న వధూవరులను చూస్తూ మంత్రాలు చదువుతూ వివాహం జరిపించారు. – కోహెడ