మంత్రాలయం, ఆగస్టు 9: ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏటా నిర్వహించే రాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వారం రోజులపాటు స్వామివారి 351వ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు శ్రీమఠం అధికారులు ఏర్పాట్లు చేశారు.