మహబూబాబాద్ : జిల్లా పోలీసులు మానవత్వం చాటారు. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఖాకీలు అంటే కర్కశత్వమే అనే నానుడి నిజం కాదని తమకు మనసు ఉంటుందని చేతల్లో చూపారు.
వివరాల్లోకి వెళ్తే..జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒక అనాథ మహిళ (40) మూడు రోజుల క్రితం చనిపోయింది. అయితే పోలీసులు అనాథ మృతదేహాన్ని జిల్లా దవాఖానలోని మార్చురీకి తరలించారు. మూడు రోజులుగా ఆమె కోసం ఎవరైనా వస్తారు అని వేచి చూశారు.
ఎవరూ రాకపోవడంతో మృతదేహానికి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తు తెలియని (40) సంవత్సరాల మహిళ మూడు రోజుల క్రితం వడదెబ్బతో టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన పడి ఉంది. దీంతో పోలీసులు జిల్లా దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని చెప్పారు.
అనంతరం మృతదేహాన్ని జిల్లా దవాఖానలోని మార్చరీకి తరలించారు. ఎవరైనా వస్తారేమోనని పోలీసులు ఎదురు చూశారు. ఎవరూ రాకపోవడంతో సోమవారం ఉదయం ఆరున్నర గంటల సీఐ వెంకటరత్నం. ఎస్సై సంతోష్ కుమార్.
కానిస్టేబుల్ మోహన్ రాజులతో కలిసి నిజాం చెరువు శివారులో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం తో మహబూబాబాద్ పట్టణంలో అంత చర్చనీయాంశంగా మారింది.
అనాథ మహిళ పట్ల టౌన్ పోలీసులు చేసిన సేవలను ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం