భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైరవ్ మృతిచెందాడు. మండలంలోని బాగిర్తిపేట వద్ద ఓ లారీ డ్రైవర్బహిర్భూమికి వెళ్లడానికి తన లారీ ఆపాడు. ఈ క్రమంలో లారీ దిగుతుండగా మరో లారీ వచ్చి అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతునికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.