హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఈఈజేఏసీ) నేతలు గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ) నవీన్మిట్టల్తో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువుపెట్టారు.
పీఆర్సీ కమిటీ వేయాలని, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్నకు మార్పు చేయాలని, ఈపీఎఫ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను వెంటనే క్లియర్ చేయాలని, విద్యుత్ సంస్థల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు.