ఢిల్లీ,జులై 3:సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు-2021కు అర్హులైనవారు తమ నామినేషన్లను పంపడానికి లేదా అర్హులైనవారి తరఫున ఇతరులు సిఫారసు చేయడానికిగాను ఆగస్టు 15 చివరి తేదీ అని కేంద్ర హోంశాఖ తెలిపింది. దేశ ఐకమత్యం, సౌభ్రాతృత్వం కోసం కృషి చేసేవారికి ఇచ్చే ఈ అవార్డును సర్దార్ వల్లభాయి పటేల్ పేరుతో కేంద్ర హోంశాఖ ప్రారంభించింది. జాతీయ ఐకమత్యాన్ని కాపాడుతూ భారతదేశ సాధనకోసం కృషి చేసేవారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి ఈ అవార్డును నెలకొల్పారు.
కుల,మత,ప్రాంత,రాజకీయాలు,వయస్సు,వృత్తికి అతీతంగా ఎవరైనా సరే ఈ అవార్డుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులే కాదు సంస్థలు కూడా ఈ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భారత దేశంలోని ఏ వ్యక్తయినా,ఏ సంస్థయినా సరే అర్హత వున్నవారిని,అర్హత వున్న సంస్థల పేర్లను ఈ అవార్డు కోసం సిఫారసు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు,ఆయా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు కూడా అవార్డుకోసం దరఖాస్తు చేయవచ్చు. https://nationalunityawards.mha.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను పంపవచ్చు.