KTR | రాష్ట్రంలో ఇప్పుడున్నది అచ్చ కాంగ్రెస్ కాదు, పచ్చ కాంగ్రెస్ కాదు, లుచ్చ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై హరీశ్ రావుతో కలసి తెలంగాణ భవన్లో షార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అసలైన కాంగ్రెస్ లేదని తెలంగాణ సమాజాం అనుకుంటుందన్నారు. మొదటి నుంచి వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి అందలం ఎక్కించారన్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించారన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ శతాబ్దం అతి పెద్ద మోసం కాగ్రెంస్ మోనిఫెస్టో అని విమర్శించారు.
ఇప్పుడున్నది అచ్చ కాంగ్రెస్ కాదు,
పచ్చ కాంగ్రెస్ కాదు,
లుచ్చ కాంగ్రెస్ https://t.co/j9FwJaqSkp pic.twitter.com/WOTOJZ8GBn— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026