ఖైరతాబాద్లో కొలువుదీరనున్న 50 అడుగుల శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. శిల్పి రాజేంద్రన్ ఆదివారం స్వామివారికి నేత్రాలంకరణ చేశారు.
67 సంవత్సరాల ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలో తొలిసారి మట్టి ప్రతిమను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్రాజ్, కార్యనిర్వాహక కార్యదర్శి సింగరి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.