కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్కు చెందిన సుజాత నాలుగున్నర కిలోల ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వైద్యులు నిశ్చలారెడ్డి, రాజశ్రీ మాట్లాడుతూ.. మధుమేహం ఉన్నవాళ్లలో ఎక్కువ బరువున్న శిశువులు జన్మిస్తారని, ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
– విద్యానగర్(కరీంనగర్)