హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో యూఎస్ కాన్సులేట్ జనరల్గా జెన్నిఫర్ లార్సన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అమెరికా నుంచి సోమవారం హైదరాబాద్కు చేరుకున్న ఆమెకు కాన్సులేట్ అధికారులు స్వాగతం పలికారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న యూఎస్ కాన్సులేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాలకు సంబంధించి అమెరికా దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. జెన్నిఫర్ లార్సన్ గతంలో ముంబైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్లో డిప్యూటీ ప్రిన్సిప్ ఆఫీసర్గా, భారతదేశ వ్యవహారాల తాత్కాలిక డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. దీంతో ఆమెకు భారత్తో ఎన్నో ఏండ్లుగా అనుబంధం ఏర్పడింది. తాజాగా హైదరాబాద్లో యూఎస్ కాన్సులేట్ జనరల్గా నియమితులైన ఆమె మూడు రాష్ర్టాలతో అమెరికా భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు కృషిచేస్తానని చెప్పారు.