హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఐటీ టీవీ గ్లోబల్ మీడియా మొదటి ఎడిషన్ అవార్డుల కార్యక్రమం టీహబ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయా విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి సినీహీరో సుమన్ అవార్డులు ప్రదానం చేశారు.
‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక నుంచి స్టేట్ క్రైమ్ బ్యూరో రిపోర్టర్ తోటపల్లి రవికుమార్ ‘బెస్ట్ క్రైమ్ రిపోర్టింగ్’ విభాగంలో, సిటీ బ్యూరో రిపోర్టర్ కడార్ల కిరణ్ ‘బెస్ట్ స్టార్టప్ స్టోరీస్’ విభాగంలో అవార్డులు అందుకున్నారు. టీన్యూస్ వీడియో జర్నలిస్టులు భాస్కర్, రాజశేఖర్ కూడా బెస్ట్ క్రైమ్ రిపోర్టింగ్ (ఎలక్ట్రానిక్), బెస్ట్ ఎడ్యుకేషన్, ఎన్టీవీ రిపోర్టర్ రవికుమార్ స్పోర్ట్స్, హెచ్5 రిపోర్టర్ అనిల్ అవార్డులందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ టీవీ గ్లోబల్ మీడియా నిర్వాహకులు, పాల్గొన్నారు.