హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ప్రాక్టికల్స్ గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు మొదటి విడత, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు రెండో విడత, ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు మూడో విడతలో ప్రాక్టికల్స్ కొనసాగుతాయి. ఇందుకు మొత్తం 2,032 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. జనరల్ కోర్సుల్లో 3.21 లక్షలు, వొకేషనల్లో 94 వేల మంది విద్యార్థులు ప్రాక్టికల్స్కు హాజరుకానున్నారు. ఎంపీసీ విభాగంలో 2,17,714, బైపీసీలో 1,04,089 మంది విద్యార్థులు, వొకేషనల్ ఫస్టియర్లో 48,277, సెకండియర్లో 46,542 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.