హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు అమలు చేస్తున్న 5 రోజుల (Five-Day Work ) పనిదినాలను తెలంగాణలోనూ అమలు చేయాలని ఉద్యోగ , ఉపాధ్యాయ,గెజిడెట్, వర్కర్స్, పెన్షర్ల జేఏసీ ప్రభుత్వానికి లేఖ ( JAC Letter ) రాసింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వారంలో ఐదురోజుల పనిదినాలను అమలు చేయాలని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ( Chairman Jagadiswar ), ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ( Secretary Srinivas Rao ) కోరారు.
ఈ విధానం వల్ల ఇంధన పొదుపుతో పాటు కాలుష్యం నివారణ, ఉద్యోగుల భద్రతను కాపాడుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం ఉద్యోగులు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బదులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధులు నిర్వహించే అవకాశముంటుందని వెల్లడించారు .
ఈ పనిదినాల గురించి ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వాలకు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని, ఇప్పటి నుంచైనా రాష్ట్రంలో 5 దినాల పని విధానాన్ని అమలు చేయాలని లేఖలో ముఖ్యమంత్రి ని కోరారు.