కంది, ఏప్రిల్ 16: అత్యాధునిక పరిశోధనల కేంద్రంగా ఐఐటీ హైదరాబాద్ పేరుగాంచిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ అన్నారు. ఆదివారం ఐఐటీహెచ్లో డీఆర్డీవో ఇండస్ట్రీ-అకాడెమియా సెంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐఐటీహెచ్లో డీఆర్డీవోకు అవసరమైన దీర్ఘకాలిక నిర్దేశిత పరిశోధనల దిశగా భవిష్యత్తు ప్రాజెక్టులను చేపట్టేందుకు ఈ సెంటర్ను ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ నారాయణమూర్తి, డీఎస్ డైరెక్టర్ జనరల్ హరిబాబు, ఓఎస్ డైరెక్టర్ శ్రీవాస్తవ, ఐడీఎఎస్ వెద్వీర్ ఆర్య, అడిషనల్ ఎఫ్ఏ కైలాశ్కుమార్ పాఠక్, పలువురు డైరెక్టర్లు, ప్రొఫెసర్లు, డీఆర్డీవో ల్యాబ్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.