సంగారెడ్డి, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మార్కెట్లో త్వరలో ఫ్యామిలీ ఫ్లైట్లు అందుబాటులోకి రానున్నాయి. వ్యక్తిగత విమాన వాహనాల పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించిన డిజైన్లను సిద్ధంచేసింది. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ చాలాకాలంగా వ్యక్తిగత విమాన వాహనాల(పీఏవీ) తయారీపై పరిశోధన జరుపుతున్నది.
ఐఐటీహెచ్లో పీహెచ్డీ స్కాలర్ ప్రియబత్ర రౌత్రే ఆధ్వర్యంలోని బృందం వీటికి సంబంధించిన డిజైన్లను రూపొందించింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా పీఏవీ క్యాబిన్, ఇంజిన్లు, సీటింగ్ తదితర అంశాలపై పరిశోధన చేసి డిజైన్లను తయారుచేశారు. వీటిని శుక్రవారం ప్రదర్శించనున్నట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. గురువారం ఆయన ఐఐటీ హైదరాబాద్లో మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో పీఏవీల రూపకల్పనపై ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా పరిశోధనలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రియబ్రత రౌత్రాయ్ పీఏవీ డిజైన్లు సిద్ధం చేయడం సంతోషంగా ఉన్నదని తెలిపారు.
పీఏవీ డిజైన్ ప్రాజెక్టు హెడ్ ప్రొఫెసర్ దీపక్ మాథ్యూ మాట్లాడుతూ పీఏవీలపై ఐఐటీ హైదరాబాద్ జరుపుతున్న పరిశోధనలు ఆధునిక రవా ణా వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటు న్నాయని పేర్కొన్నారు. పీఏవీ ప్రాజెక్టు డిజైన్లు రూపొందించిన పీహెచ్డీ స్కాలర్ ప్రియబ్రత రౌత్రాయ్ మాట్లాడుతూ.. ‘వరల్డ్ ఆఫ్ పీఏవీ’ ప్రాజెక్టులో భాగంగా పీఏవీ డిజైన్లు సిద్ధ్దం చేయడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. తన పరిశోధనలకు, డిజైన్ల రూపకల్పనకు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్ దీపక్ మాథ్యూ, స్వీన్బర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బోరిస్ ఐసెన్బార్ట్, చార్లీ రాన్స్కోంబ్, జోయ్ కుయ్స్ సహకరించినట్లు చెప్పారు.