హనుమకొండ, జూన్ 15 : విద్యుత్తు సరఫరాలో అంతరాయాన్ని నివారించేందుకు గాను ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సరిళ్లలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్టు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వానకాలంలో భారీ వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్తు సరఫరాకు జరిగే అంతరాయాన్ని అధిగమించేందుకు ‘హైపర్’ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్తు సరఫరా దెబ్బతినే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో సమస్యలను ముందుగానే గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పరిషరించేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
ఏటా వానకాలంలో ఈదురు గాలులతో విద్యుత్తు శాఖ ఎక్కువ ప్రభావితం అవుతుందని, ఈ క్రమంలో వినియోగదారులకు తక్కువ సమయంలో విద్యుత్తు పునరుద్ధరణ సేవలు అందించేందుకు ఈ హైపర్ ప్లాన్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ప్రతి సరిల్లో ఎమర్జెన్సీ రెస్టోర్ టీం వాహనాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఎస్సీఏడీఏ, జీఐఎస్, ఓఎంఎస్ వంటి డాటా వ్యవస్థలను ఏఐతో అనుసంధానం చేశామని, దీంతో ఫీడర్లలో సమస్యలను ముందే అంచనా వేయవచ్చని, విద్యుత్తు డిమాండ్ను ముందే అంచనా వేసి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు లైన్ల పర్యవేక్షణ, నష్టాల గుర్తింపు కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు.