హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): అంతరించిపోతున్న కప్ప జాతులు మళ్లీ పునర్జీవం పోసుకుంటున్నా యి. భూమిపై 144కు పైగా కప్ప జాతులు ఉండగా, ఇందులో పర్యావరణ మార్పులు, అడవుల నరికివేతతో 20కిపైగా జాతులు మ నుగడ కోల్పోయాయి. ఇటీవల వాటి జాడ ను పరిశోధకులు గుర్తించారు. సెంటర్ ఫర్ సె ల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ, మహారాష్ట్ర అటవీశాఖ ప్రోత్సాహంతో జరిగిన అధ్యయనంలో మహారాష్ట్రలోని సింధుదుర్గ్ తిలారీ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాంతాలు కప్ప జాతులకు నివాస ప్రాంతాలుగా మారినట్టు వెల్లడైంది.
ఇక్కడి పర్వత ప్రాంతాల్లో అంతరించిపోతున్న 12 కప్పజాతుల ఉనికిని గుర్తించారు. ఏటా 3000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఈ ప్రాంతంలో ఎక్కువగా కాజు, అరటి, పైనాపిల్తోపాటు రబ్బరు తోటలు ఉన్నాయి. ఈ కొండల్లో పదుల సం ఖ్యలో అంతరించిపోతున్న కప్ప జాతుల మనుగడను గుర్తించారు. ఇందులో ప్రధానమైన చిరవాసీ, మినర్వార్యా సేప్ఫీ, అంబోలి, గోమంతకి వంటి జాతుల మనుగడ క్రమంగా పెరుగుతున్నట్టుగా గుర్తించారు. రెండు, మూడున్నర మీటర్ల ఎత్తులో పెరిగే కాజు తోటలు వీటి ఆవాసానికి అనుకూలంగా ఉన్నాయని తేలింది.