శంషాబాద్ రూరల్, జనవరి 25 : హైదరాబాద్-గోవా ‘ఆకాశ ఎయిర్’ విమాన సర్వీసును బుధవారం జీఎంఆర్ ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ పనిక్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వీలైనంత దేశీయ ఎయిర్ కనెక్టివిటి నెట్వర్క్ను విస్తరించడంతోపాటు విమానాయాన సంస్థలను జోడించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో సర్వీసులు దశలవారీగా విస్తారిస్తామని అన్నారు. మొదటి విమాన సర్వీసును బుధవారం 12.30 గంటలకు ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.