కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 292 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగ్గా.. టీఎంసీ 184 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 108 స్ధానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత విజయవర్గీయ స్పందించారు. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయని, ఏదైనా ముందే స్పందించడం తొందరపాటు అవుతుందన్నారు. సాయంత్రం వరకు పరిస్థితి తెలుస్తుందని పేర్కొన్నారు. పార్టీకి వంద సీట్లు రావని సవాల్ చేశారని, మేం ఇప్పుడు ఆ మార్క్ను దాటామన్నారు. చివరకు మ్యాజిక్ నంబర్ను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.