హైదరాబాద్ : సికింద్రాబాద్ -కర్నూల్ సిటీ హంద్రీ ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాద్ స్టేషన్ వరకు పొడిగించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. హంద్రీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 16:20 గంటలకు బయల్దేరుతుందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.
వేసవికాలం నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కాజీపేట్ నుంచి తిరుపతి వరకు పది ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు ఈ నెల 31 నుంచి జూన్ 28 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.