మహదేవపూర్, ఆగస్టు 21: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలో ఉన్న లక్ష్మీ బరాజ్కు వరద క్రమక్రమంగా పెరుగుతున్నది. ఆదివారం 2,48,070 క్యూసెక్కుల ప్రవాహం రాగా, సోమవారం ఇన్ఫ్లో 4,75,211 క్యూసెక్కులకు పెరిగింది.
బరాజ్లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు భారీ నీటిపారుదల శాఖ డీఈఈ సురేశ్ తెలిపారు. బరాజ్ ప్రస్తుత నీటిమట్టం 5.90 మీటర్లుగా ఉందని ఆయన వెల్లడించారు.