హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27న టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ ముస్తాబవుతున్నది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే ప్రతినిధులకు ఎలాంటి లోటుపాట్లు లేకుం డా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్, సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం చుట్టుపక్కల సీఎం కేసీఆర్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతిబింబించేలా హైదరాబాద్ నగరం చుట్టూ ఏర్పాట్లు చేస్తున్నారు.