హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాం హైకోర్టు అడ్వకేట్ల సంఘం (హెచ్సీఏఏ) ఎన్నికలు ఈ నెల 31న జరగనున్నాయని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి బుధవారం ప్రకటించారు. ఓటర్ల జాబితా 17న వెలువడుతుందని, 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందని, పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను 22న వెల్లడిస్తారని వివరించారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరిస్తుందని తెలిపారు.
ఎన్నికలు జరిగే వరకు హెచ్సీఏఏ విధులను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని నరసింహారెడ్డి నియమించారు. ఈ కమిటీలో సీనియర్ న్యాయవాదులు టీ సూర్యకరణ్రెడ్డి, ఎల్ రవిచందర్, జీ రవిమోహన్ ఉన్నారు.
రుణాల రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీ సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా టీ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా టీ శ్రీధర్ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా టీ శ్రీధర్రెడ్డి, క్రీడల కార్యదర్శిగా వీ రవీందర్, కోశాధికారిగా జీ దినేశ్ కుమార్, లైబ్రేరియన్గా టీ రణధీర్సింగ్, మరో నలుగురు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి బుచ్చిబాబు బుధవారం ప్రకటించారు.