హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): నిజాం హయాంలో చీఫ్ ఇంజినీర్గా సేవలందించిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ సేవలు ఎనలేనివని తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్ కొనియాడారు. నవాజ్ జంగ్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలను ఎర్రమంజిల్లోని జలసౌధలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జలసౌధ ప్రాంగణంలోని నవాజ్ జంగ్ బహదూర్, ఆర్ విద్యాసాగర్రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యుత్తు సౌధలో టీఈఈఏ నిర్వహించిన ఇంజినీర్స్డేలో నవాజ్ జంగ్ చిత్రపటానికి టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పుష్పాంజలి ఘటించారు. ఇంజినీర్స్ డేను తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) ఘనంగా నిర్వహించింది.