హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఆదివారం 5వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తంగా 638 గురుకులాల్లో 51,524 సీట్లు అందుబాటు లో ఉండగా, 1,21,826 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 330 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఐదో తరగతి గురుకుల ప్రవేశాలకు నల్లగొండ జిల్లా నుంచి అత్యధికంగా 9,379 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా జనగాం జిల్లా నుంచి 942 దరఖాస్తులు మాత్రమే దాఖలైనట్టు అధికారులు పేర్కొన్నారు.
గురుకులాల్లో ఈసారి అదనంగా 3,404 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. నిరుడు మొత్తం 48,120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది అదనంగా 33 బీసీ గురుకులాలను మంజూరు చేసింది. ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలోనూ బాన్సువాడ, మహబూబాబాద్లో గురుకులాలను మం జూరు చేసింది. దీంతో అదనంగా 3,404 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.