హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : భూగర్భ జలశాఖలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. పోస్టుల వారీగా మెరిట్ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ తన వెబ్సైట్లో పొందుపరిచింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. నిరుడు జూలై 18, 19, 20, 31 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.