హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆపే అధికారం గవర్నర్కు లేదని స్పష్టంచేశారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తొకిపెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
రాజ్భవన్లో ప్రజాదర్బార్ నిర్వహించడం, ఎవరైనా వచ్చి వినతిపత్రాలు ఇవ్వొచ్చని చెప్పడం సరికాదన్నారు. ఇది గవర్నర్ తన పరిధిని దాటడమేనని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలను ప్రజలు ఎన్నకున్న ప్రభుత్వమే పరిషరిస్తుందని.. సీఎం, మంత్రులకు ఆ అధికారాలు ఉంటాయని గుర్తుచేశారు. గవర్నర్ కేంద్రానికి రబ్బర్ స్టాం ప్గా, బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.