హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేసుకుంటూ వెళ్లడమే మన పని అని కృష్ణతత్వం వెల్లడిస్తుందని గవర్నర్ అన్నారు. గోకులాష్టమిగా, ఉట్ల పండుగగా ప్రజలు జరుపుకొనే శ్రీ కృష్ణుని జన్మదినానికి పురాణ, ఇతిహాసాల్లో ప్రత్యేకత ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. భారతీయ హిందూ ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ జీవనవిధానంలో శ్రీకృష్ణుని తాత్వికత అత్యంత ప్రత్యేకమైనదని, ప్రభావశీలమైనదని పేర్కొన్నారు. నేటి యువత శ్రీకృష్ణుని జీవన ప్రయాణాన్ని లోతుగా అవగాహన చేసుకోవాల్సి ఉన్నదని తెలిపారు.